Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 24 గంటలు, 365 రోజులు నెఫ్ట్.. ఆర్బీఐ శుభవార్త

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:34 IST)
దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలు, నగదు బదిలీలో క్రమంగా పెరిగాయి. గతంలో బ్యాంకులకు వెళ్లి డబ్బులు వేసే వాళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీలు ఎక్కువగా చేస్తున్నారు.

ఇక బ్యాంకులు కూడా వాటికి భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఎక్కువగా బ్యాంకింగ్ వినియోగదారులు వాటిపై మొగ్గు చూపిస్తున్నారు.
  
ఈ నేపథ్యంలో వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు ఏ సమయంలో అయినా సరే బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. 
 
ఇకపై సోమవారం నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ, 365 రోజులూ నిరంతరాయంగా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ నుంచి నగదు బదిలి అవకాశం ఉండేది.
 
దీనితో వినియోగదారులు ఎక్కువగా గూగుల్, ఫోన్ పే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు… సమయపరిమితి విధానంకి గుడ్ బై చెప్పింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో సైతం ఇక నెఫ్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments