Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో రూ.80కి పెరిగిన టమోటా ధరలు.. రైతు బజారులో ఎంత?

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:40 IST)
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి టమాటను విక్రయించనుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రాయలసీమ జిల్లాల నుంచి లేదా టమాటా తక్కువ ధరకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. 
 
టమాటా కిలో రూ.50 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రస్తుతం టమాటా మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారులు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు పెరిగినా మార్కెట్‌లో నాణ్యమైన టమాట దొరకడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments