కిలో రూ.80కి పెరిగిన టమోటా ధరలు.. రైతు బజారులో ఎంత?

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:40 IST)
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి టమాటను విక్రయించనుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రాయలసీమ జిల్లాల నుంచి లేదా టమాటా తక్కువ ధరకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. 
 
టమాటా కిలో రూ.50 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రస్తుతం టమాటా మార్కెట్‌లో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారులు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు పెరిగినా మార్కెట్‌లో నాణ్యమైన టమాట దొరకడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments