Webdunia - Bharat's app for daily news and videos

Install App

తత్కాల్ టైమింగ్స్ మారింది... రూటు మారితే రిఫండ్

రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (08:58 IST)
రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర్పులు చేశారు. 
 
ఆ ప్రకారంగా, ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
 
ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌ - దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చు.
 
బుక్‌ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్‌ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments