Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులను ఆపండి.. కేంద్రం కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (08:26 IST)
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయవద్దని అన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌లను కేంద్ర ప్రభుత్వం కోరింది. 
 
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజధానిలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. బ్యాటరీ స్కూటర్లు అగ్ని ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో దీని ప్రజల తీవ్ర ప్రభావం చూసే సమస్యగా కేంద్రం పరిగణిస్తోంది. 
 
ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులు ప్రస్తుత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మోడళ్లను విక్రయించే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే అగ్ని ప్రమాదాలకు కారణాన్ని మరింత పరిశోధించడానికి పలు కంపెనీలు తమ వాహనాలను రీకాల్‌ చేశాయి.
 
సకాలంలో స్కూటర్లను రీకాల్ చేయడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలను హెచ్చరించారు. 
 
ఈ ఆదేశాలకు అనుగుణంగా పలు కంపెనీలు ఈ ఏడాది ఎలాంటి కొత్త మోడల్స్‌ను లాంఛ్ చేసే అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు కేవలం మౌఖిక సూచనగా ఉన్న దానికి బ్రాండ్‌లు ఎలా స్పందిస్తాయన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments