Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మండే... మార్కెట్లు భారీ పతనం : రూ.6.86 లక్షల కోట్ల ఆవిరి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:55 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దాదాపు 6.86 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.
 
కరోనా ఉద్ధృతి మరింత పెరిగితే బ్యాంకింగ్ రంగానికి గడ్డు కాలమే అని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రంగ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 
 
మిగిలిన బ్యాంకులు కూడా అదే బాట పడుతున్నాయి. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 1741 పాయింట్లు, నిఫ్టీ 527 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments