Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడుగంటిన చమురు నిల్వలు - మరోసారి పెరిగిన ధరలు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:53 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంక దేశంలో చమురు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో పెట్రోల్, డీజల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. ఫలితంగా ఈ చమురు కోసం ప్రజల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుుకుంటున్నాయి. శ్రీలంకలో 1948 తర్వాత ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, శ్రీలంకలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర రూ.450గా ఉంటే, డీజిల్ ధర రూ.445గా పలుకుతోంది. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదు. చమురు నిల్వలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేయడంపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఇదిలావుంటే, శ్రీలంకకు భారత్ మరోమారు ఆపన్నహస్తం అందించింది. ఇప్పటికే ఒకసారి 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పంపించింది. ఇపుడు మరోమారు అంతే మొత్తంలో పెట్రోల్‌ను పంపించింది. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments