Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేభారత్‌ రైలు ఛార్జీల ఖరారు.. ధరెంతో తెలుసా?

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:06 IST)
సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలను రైల్వే అధికారులు ఖరారు చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జ్‎ల టేబుల్‎ను శనివారం విడుదల చేశారు. ఛైర్‌కార్‌ ఛార్జ్ రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛార్జ్ రూ.3080 ఫిక్స్ చేశారు. 
 
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.1625 నిర్ణయించారు. దీంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తగా మారనుంది. ఇక గంటల పాటు ప్రయాణం చేయాల్సిన పని వుండదు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై నల్గొండ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. 
 
ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్‌లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి ప్రారంభమై రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments