Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం మోసాలకు బ్రేక్.. ఎస్‌బీఐ చర్యలు.. జనవరి 1 నుంచి అమలు

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (11:40 IST)
రోజురోజుకీ ఏటీఎం మోసాలు ఎక్కువవుతుండటంతో వీటిని నివారించడానికి ఎస్‌బిఐ చర్యలు ప్రారంభించింది. ఏటిఎం మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకురానుంది.
 
ఎస్‌బిఐ కస్టమర్‌లు జనవరి 1వ తేదీ నుంచి రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీని నమోదు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఓటీపీ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే వర్తిస్తుందని ఎస్‌బిఐ పేర్కొంది. ఈ సమయంలో పది వేలకు పైన డబ్బు విత్‌డ్రా చేసుకునే కస్టమర్‌లను ఓటీపీ నమోదు చేయమని అడుగుతుంది.
 
కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మాత్రమే విత్‌డ్రా చేయడం వీలవుతుంది. ఓటీపీ విధానం ద్వారా అనధికారిక లావాదేవీలను నివారించవచ్చని ఎస్‌బిఐ పేర్కొంది. అయితే ఎస్‌బిఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో లేదా ఇతర బ్యాంక్ కార్డ్ వినియోగదారులు ఎస్‌బిఐ ఏటీఎంల్ల ఈ సదుపాయాన్ని పొందలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments