Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ ఫిషర్ హౌస్‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకుల బృందం!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (10:28 IST)
ఒకప్పుడు లిక్కర్ కంపెనీ యునైటెడ్ బీవరేజస్ (యూబీ) చీఫ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన కింగ్ ఫిషర్ హౌస్‌ను భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల బృందం స్వాధీనం చేసుకుంది. 
 
అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్ మాల్యా ప్రతిష్ట ఇపుడు పూర్తిగా దిగజారిన విషయం తెల్సిందే. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ సమీపంలో విలే పార్లే వద్ద ఉన్న కింగ్‌ ఫిషర్ ఎయిర్‌ లైన్స్‌ అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన 'కింగ్‌ ఫిషర్ హౌస్'ను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. 
 
తన కలల భవనమని మాల్యా చెప్పుకునే ఈ బిల్డింగ్ మొత్తం 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుంది. కాగా, మూతబడిన కింగ్ ‌ఫిషర్ ఎయిర్‌ లైన్స్ నుంచి 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు (వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. వీటిని చెల్లించడంలో మాల్యా విఫలం కాగా, కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేసిన సంగతి తెలిసిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments