‘సాల్వ్ ఫర్ టుమారో 2025’ పోటీని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

ఐవీఆర్
గురువారం, 1 మే 2025 (22:13 IST)
భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ తన సామ్‌సంగ్ 'సాల్వ్ ఫర్ టుమారో' కార్యక్రమం నాల్గవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది సాంకే తికతను ఉపయోగించుకోవడం ద్వారా సమాజంలోని కొన్ని ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి విద్యా ర్థులను వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ప్రేరేపించడానికి రూపొందించబడిన దేశవ్యాప్త పోటీ.
 
సామ్‌సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’ మొదటి నాలుగు విజేత జట్లకు వారి ప్రాజెక్టుల ఇంక్యుబేషన్‌కు మద్దతు ఇవ్వడానికి రూ.1 కోటి అందిస్తుంది. అలాగే సామ్‌సంగ్ ఉన్నతాధికారులు, ఐఐటీ దిల్లీ అధ్యాపకుల నుండి ఆచరణాత్మక నమూనా తయారీలో మద్దతు, ఇన్వెస్టర్ల సంబంధాలు, నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తాయి. ఈ విధమైన గుర్తింపు అనేది పోటీలో రాణించడమే కాకుండా సమస్యలను అధిగమించే పరిష్కారాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను చాటిచెబుతుంది. అంతిమంగా భారతదేశం అంతటా కమ్యూనిటీ లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే ఉన్నతస్థాయి, సుస్థిర వెంచర్‌లుగా అభివృద్ధి చెందుతుంది.
 
ఆరు నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమం, 14-22 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులను వ్యక్తులు లేదా సమూహాలుగా వారి సాంకేతిక ఆలోచనలను సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఈ సంవత్సరం, పాల్గొనేవారు నాలుగు కీలక ఇతివృత్తాలలో పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది. సురక్షితమైన, తెలివైన, సమగ్ర భారత్ కోసం ఏఐ; భారతదేశంలో ఆరోగ్యం, పరిశుభ్రత, శ్రేయస్సు యొక్క భవిష్యత్తు; విద్య, మెరుగైన భవిష్యత్తు కోసం క్రీడలు, సాంకేతికత ద్వారా సామాజిక మార్పు; సాంకేతికత ద్వారా పర్యావరణ సుస్థిరత్వం.
 
ఈ సందర్భంగా సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్ మాట్లాడుతూ, “సోల్వ్ ఫర్ టు మారోతో, భారతదేశంలోని ప్రతి మూలలోని యువ ఆవిష్కర్తలు పెద్ద కలలు కనేలా, వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి, సాంకేతికత ద్వారా తెలివైన, మరింత సమ్మిళిత భవిష్యత్తును రూపొందించడానికి మేం స్ఫూర్తినిస్తున్నాం. ఈ సంవత్సరం, సాల్వ్ ఫర్ టుమారో మరింత పెద్దదిగా, మరింత సమ్మిళితంగా ఉండబోతోంది. మేం మరిన్ని నగరాలను చేరుకుంటున్నాం, మరిన్ని పాఠశాలలు, కళాశాలల నుండి విద్యా ర్థులను ఇందులో భాగస్వాములుగా చేస్తున్నాం. డిజైన్ ఆలోచన సూత్రాలను వర్తింపజేస్తూ వారు ఆవిష్క రణలు చేయడానికి మార్గాలను సృష్టిస్తున్నాం. సాల్వ్ ఫర్ టుమారో భారత ప్రభుత్వం మార్గదర్శక #డిజిటల్ ఇండియా చొరవ పట్ల మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మన యువత భవిష్యత్తు రూపకర్తలుగా మారడానికి శక్తినిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments