ఈ-వేస్ట్‌ ఛానలైజేషన్‌ పైన ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌- జీఐజెడ్‌ ఇండియా వర్క్‌షాప్‌

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:49 IST)
డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌, ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌‌లు ఈ-సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ‘ఈ-వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూచైన్‌ను ఏర్పాటుచేయడం’ శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం అమలు చేయడానికి చేతులు కలిపాయి.

 
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఈ-వ్యర్ధాలను  సురక్షితంగా నిర్వహించడం పట్ల పాఠశాలలు, రిటైలర్లు, బల్క్‌ వినియోగదారులు సహా పలువురు వాటాదారులకు అవగాహన కల్పించడం. దీనిలో భాగంగా ఓ వర్క్‌షాప్‌ను  నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ఈపీఆర్‌(ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ) సమ్మతి, ఈపీఆర్‌ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు.
 
 
ఈ వర్క్‌షాప్‌ గురించి జీఐజెడ్‌ ఇండియా సర్క్యులర్‌ ఎకనమీ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ సీనియర్‌ ఎడ్వైజర్‌ గౌతమ్‌ మెహ్రా మాట్లాడుతూ, ‘‘కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి సుదీర్ఘకాలంగా నిబంధనల అమలుకు ప్రయత్నిస్తోంది. ఈపీఆర్‌ పాలసీకి కట్టుబడి ఉండటం ద్వారా  ఛానలైజేషన్‌కు సహాయపడుతుంది’’ అని అన్నారు. 

 
ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధికా కాలియా మాట్లాడుతూ ‘‘ఈపీఆర్‌ పాలసీ విజయం సాధించాలంటే వాటాదారులు తమ బాధ్యతలను గుర్తించడంతో పాటుగా మార్గదర్శకాలను అనుసరించడం చేయాలి. ఈపీఆర్‌ విధానాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నియంత్రిస్తుంది. అయితే భూగోళానికి నిలకడతో కూడిన భవిష్యత్‌ కావాలంటే మాత్రం వాటాదారులుతమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments