ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పన్నులు విధిస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సుమారు రెండు నెలలపాటు దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికలు ముగియడంతో గత నాలుగు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఢిల్లీలో నాలుగు రోజుల్లో పెట్రోల్ పై 82 పైసలు, డీజిల్పై రూ.1 పెరిగాయి.