ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం.. రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (18:08 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో రెగ్యులర్ రైళ్లను నడపడం ఇప్పుడే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు  రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. 
 
సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని వెల్లడించారు.
 
ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్‌ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్‌ రైల్‌ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. తిరిగి ప్రత్యేక రైళ్లను శ్రామికుల కోసం నడిపేందుకు సిద్ధమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments