Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ .. బంగారంపై రుణాలు.. 90 శాతం పెంపు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (19:16 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను ఊరట నిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా కష్టకాలంలో అన్నిరకాల రుణాలపై మారటోరియం గడువు పెంచిన ఆర్బీఐ.. తాజాగా బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి. 
 
కానీ ఇప్పుడు అలా కాదు.. బంగారం విలువలో ఇప్పుడు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇప్పటివరకు బంగారం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, మొదట మీ బంగారం నాణ్యతను తనిఖీ చేస్తుంది. 
 
రుణ మొత్తాన్ని బంగారం నాణ్యత ప్రకారం నిర్ణయిస్తారు. బ్యాంకులు సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కానీ ఆర్బీఐ తాజా సూచనలతో బంగారం రుణం విలువ 90 శాతం పెంచింది. సాధారణంగా, 18 నుండి 24 క్యారెట్ల బంగారం మంచి మొత్తాన్ని ఇస్తుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో​ 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments