Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు డిపాజిట్ చేశారా? ఆర్బీఐ నిబంధన

నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:04 IST)
నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలు అంతకన్నా ఎక్కువ డబ్బును జమ చేసిన వారు, రూ.5 లక్షలకుపైగా డబ్బు ఉన్న ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకొనేందుకు పాన్‌ నంబరును తప్పనిసరిగా సమర్పించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాన్‌ లేకుంటే ఫాం 60 సమర్పించాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన నగదు బదిలీకి కూడా వర్తిస్తుందని పేర్కొంది. 
 
అలాగే, జన్‌ధన్‌ ఖాతాదారులు మాత్రం రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేసినప్పటికీ... వారికి ప్రతి నెలా రూ.10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కొన్ని బ్యాంకుల్లో కేవైసీ నిబంధనలను పాటించడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు విధించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై పైన పేర్కొన్న ఖాతాల్లో ప్రతి లావాదేవీకీ పాన్‌ను తప్పనిసరిగా కోట్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments