Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు ఊరట : టిక్కెట్ రద్దు గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (11:35 IST)
భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. గత యేడాది మార్చి 21 - జూన్ 31 మధ్య రైల్వే కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇది ఎంతో శుభవార్త. లాక్డౌన్ కారణంగా అప్పట్లో రైళ్లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా సేవలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
 
దీంతో రైలు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు వాటిని రద్దు చేసుకునేందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆ సమయాన్ని మరో మూడు నెలలు పెంచి తొమ్మిది నెలలు చేసింది. ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసినప్పటి నుంచి 9 నెలల్లోపు ఎప్పుడైనా తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ప్రభుత్వం రద్దు చేసిన సాధారణ షెడ్యూల్డ్ రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 
కరోనా కారణంగా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కొద్దిమందిని మాత్రమే అనుమతించడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులో చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో గడువును మరింత పెంచాలన్న అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments