Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘురామ రాజన్ దోసె సిద్ధాంతం: వారు ఎంచక్కా నాలుగు దోసెలు కొనగలరు. తినగలరు!

Webdunia
శనివారం, 30 జనవరి 2016 (10:46 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ రాజన్ కొత్త దోసె సిద్ధాంతాన్ని చెప్పారు. ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చి (ఎన్ సీఏఈఆర్)లో శుక్రవారం సీడీ దేశ్ ముఖ్ స్మారక ఉపన్యాసం చేసిన సందర్భంగా రఘురామ రాజన్ నోట వినిపించిన ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తికరంగా సాగింది. 
 
‘ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండాలి. అప్పుడే పెన్షనర్ల జీవితం హాయిగా ఉంటుందని చెప్పారు. అప్పుడే వారు ఎంచక్కా నాలుగు దోసెలు కొనగలరు. తినగలరు. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు... కొనుగోలు శక్తి పెరుగుతుందని రఘురామ రాజన్ వెల్లడించారు. 
 
ఇంకా ఒకవేళ వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పెన్షనర్లు ఎక్కువ దోసెలు తినగలరు’’ అని రాజన్ ఆ సిద్ధాంతాన్ని వల్లె వేశారు. కాస్తంత హ్యూమరస్ గానే అనిపించినా, సామాన్యులకు కూడా ఈ సిద్ధాంతంతో ద్రవ్యోల్బణం ప్రభావం ఇట్టే అర్థమవుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments