Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిగా నరేంద్ర మోడీ... ఆదానీ సంపదలో 4 రెట్లు పెరుగుదల

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:21 IST)
భారతదేశ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ ఆదానీ సంపద ఈ యేడాది ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత ప్రధానమంత్రి నరేదంద్ర మోడీకి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా పేరుగడించిన ఆదానీ.. ఇపుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సంపద కూడబెట్టిన కోటీశ్వరుల్లో ఒకరిగా రికార్డులకెక్కారు. ఈ యేడాది ఆయన ఏకంగా దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది. 
 
కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో ఆయన దశ తిరిగిపోయింది. ఫలితంగా ఆయన సంపద ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. పోర్టులు మొదలు పవర్ ప్లాంట్లు వరకు విస్తరించారు. ఆదానీ కంపెనీల్లోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 
 
దీంతో ఆయన సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచంలోని ఇతర బిలియనీర్లందరికంటే ఆదానీ సంపదే గణనీయంగా పెరిగింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కథనం ప్రకారం... 2021లో ఆదానీ సంపద 16.2 బిలినయన్ల నుంచి 50 బిలియన్లకు పెరిగింది. దీంతో ఆయన ఈ ఏడాది అత్యధిక సంపద కూడపెట్టిన బిలియనీర్లలో నెంబర్ వన్‌గా నిలిచారు. 
 
2021 ప్రపంచ కుబేరుడి స్థానం కోసం పోటీపడుతున్న ఎలన్‌ మస్క్, జెఫ్ బెజోస్‌లను సైతం ఆదానీ వెనక్కి నెట్టడం మరో విశేషం. ఒక్కటి మినహా ఆదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మొత్తం ఈ ఏడాది దాదాపు 50 శాతం మేర దూసుకెళ్లాయి. మరోవైపు ఇదే సమయంలో ఆసియా నెంబర్ వన్ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద 8.1 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments