Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబితా నుంచి పాకిస్థాన్ తొలగింపు : భారత్ కఠిన నిర్ణయం

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:42 IST)
జమ్మూకాశ్మీర్ దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఆత్మాహుతి దాడి జరుగగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య శుక్రవారానికి 49కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఇందులో ఆత్మాహుతి దాడితోపాటు తదనంతర పరిణామాలపై చర్చించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ దాడిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను తొలగిస్తున్నట్టు చెప్పారు. తద్వారా పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయబోతున్నట్టు వెల్లడించారు. 
 
అదేసమయంలో పుల్వామా ఘటనపై రేపు హోంమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ దాడి వివరాలను అఖిలపక్ష నేతలకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. 
 
అలాగే, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు విదేశాంగ శాఖ తరపున అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని, చొరబాటుదారులకు సాయపడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని, దేశ ద్రోహులకు సాయం చేసేవారు ఫలితం అనుభవిస్తారని జైట్లీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments