Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న మటన్, చికెన్ ధరలు..

Webdunia
గురువారం, 12 మే 2022 (18:53 IST)
మటన్, చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి.  మ‌ట‌న్, చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ప్ర‌స్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్ ధ‌ర రూ.300గా ఉంది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు పెళ్లిళ్లు కూడా ఓ కార‌ణ‌మ‌ని పౌల్ట్రీల య‌జ‌మానులు అంటున్నారు. 
 
ఇక బోన్ లెస్ చికెన్ ధ‌ర మ‌ట‌న్ రేటుతో స‌మానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ.600ల‌కు విక్రయిస్తున్నారు. ఐదు నెల‌ల క్రితం కిలో చికెన్ ధ‌ర రూ.80గా ఉన్నది. ఇప్పుడు రూ.300లకు పెరిగింది. అలాగే నాటు కోడి ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో నాటు కోడి ధర రూ. 480గా ప‌లుకుతోంది.
 
వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గడిచిన వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది.  
 
మరోవైపు మటన్ ధరలు కూడా మండిపోతున్నాయి. 10 రోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments