Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు రైల్వే జోన్ ప్రారంభానికి కాలగడువు లేదు: పియూష్ గోయల్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖకు రైల్వే జోన్ కేటాయించాల్సివుంది. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. అయితే, ఇటీవల బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. 
 
తాజాగా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని అన్నారు. రైల్వే జోన్ ప్రారంభానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు అని వెల్లడించారు. 
 
రైల్వే జోన్ డీపీఆర్ ఇంకా పరిశీలనలోనే ఉందని, రైల్వే జోన్ ప్లానింగ్‌కు ఓఎస్డీని నియమించామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌ను ఆంధ్రా డివిజన్‌లో చేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదని పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
 
కాగా, విభజన హామీ మేరకు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీల నేతలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. అదేసయమంలో వైకాపా ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments