Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల విరామం.. మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ పెట్రో బాదుడు మొదలైంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజులుగా తగ్గలేదు. ఈ క్రమంలో మంగళవారం నాడు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది.
 
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 94.54కు డీజిల్ ధర రూ. 88.69కి చేరింది. బెంగళూరులో పెట్రోలు ధర రూ. 93.98కి, డీజిల్ ధర రూ. 86.21కి చేరింది. గడచిన 54 రోజుల్లో 25 సార్లు ధరలు పెరగడంపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. 
 
కాగా, పెట్రోల్ ధరల విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తుండటం గమనార్హం. తమ లాభాలను పెంచుకునేందుకు క్రూడాయిల్‌ను వెలికితీస్తున్న ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ కోతను అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments