Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్‌టైమ్ రికార్డు : వరుసగా ఎనిమిదో రోజూ బాదుడే

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:14 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత ఎనిమిది రోజులుగా వీటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాను చేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో చమురు ధరలు ఆల్‌టైన్ గరిష్టస్థాయికి చేరాయి. 
 
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం కూడా లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.26-30పైసలు పెంచగా లీటర్‌ డీజిల్‌పై 33-38పైసలు పెంచారు. దీంతో  దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ ధర రూ.89.29 దాటింది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.70కు పెరిగింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.84, డీజిల్‌ ధర రూ.86.93గా ఉన్నాయి. గత ఎనిమిది రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.36, డీజిల్‌ రేటు రూ.2.91 పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.89.29, ముంబైలో రూ.95.75, చెన్నైలో రూ.91.45, హైదరాబాద్‌లో 92.84, బెంగుళూరులో రూ.92.28, పాట్నాలో రూ.91.67, లక్నోలో రూ.87.27, జైపూర్‌లో రూ.95.75, గుర్గామ్‌లో 87.29 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments