Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..

మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (10:44 IST)
మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.30-35 పలుకుతున్నాయి.

తెలంగాణ, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి కాకపోవడంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్లోనే కిలో రూ.30  పలుకుతోంది. పబ్లిక్ మార్కెట్లలో రూ.36వరకు కిలో ఉల్లిని వ్యాపారులు అమ్ముతున్నారు. 
 
ఉల్లి పండించే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి కూడా రోజుకు రెండుమూడు లారీలకు మించి లోడ్స్ రాకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వచ్చే నెల నుండి మండీలకు ఉల్లి లోడ్లు పెరుగుతాయని.. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లిధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అగ్రికల్చర్ సెక్రటరీ శోభన పట్నాయక్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments