Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..

మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (10:44 IST)
మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిధర ప్రస్తుతం కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.30-35 పలుకుతున్నాయి.

తెలంగాణ, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి కాకపోవడంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్లోనే కిలో రూ.30  పలుకుతోంది. పబ్లిక్ మార్కెట్లలో రూ.36వరకు కిలో ఉల్లిని వ్యాపారులు అమ్ముతున్నారు. 
 
ఉల్లి పండించే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి కూడా రోజుకు రెండుమూడు లారీలకు మించి లోడ్స్ రాకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వచ్చే నెల నుండి మండీలకు ఉల్లి లోడ్లు పెరుగుతాయని.. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లిధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అగ్రికల్చర్ సెక్రటరీ శోభన పట్నాయక్ తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments