ఓలా క్యాబ్‌లో ప్రయాణించండి... 15 రోజుల తర్వాత చెల్లించండి...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (11:41 IST)
దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఓలాకు ఒకటి. అతి తక్కువ చార్జీలకే కారు ప్రయాణ సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చిన సంస్థగా గుర్తింపు వుంది. అలాంటి ఓలా క్యాబ్ సంస్థ తాజాగా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ పేరిట సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఈ సేవల ప్రకారం.. ఓలా క్యాబ్‌లో ప్రయాణం చేసిన తర్వాత 15 రోజుల్లోపు ఎపుడైనా ప్రయాణ చెల్లింపులు చేయవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా విడివిడిగా కూడా చెల్లించవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ తరహా ఆవకాశం కొంతమంది కస్టమర్లకే అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. 
 
నిజానికి గత యేడాది పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నెల నెలా కస్టమర్లు 30 శాతం మేరకు వృద్ధి చెందారు. అందుకే పూర్తి స్థాయిలో త్వరలోనే 15 కోట్లకుపైగా కస్టమర్లకు ఈ సేవలను అందించాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లకే ఈ సేవలను అందిస్తోంది. క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్న తర్వాత 15 రోజుల్లోపు ఎలాంటి పాస్ వర్డ్, ఓటిపి అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments