త్వరలో రూ.వెయ్యి నోటు.. రూ.2 వేల నోటుకు చెల్లుచీటి? (video)

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (14:48 IST)
దేశ కరెన్సీలో మాయమైన రూ. వెయ్యి నోటు మళ్లీ కనిపించనుందా? అలాగే, ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2 వేల నోటు ఇకపై కనుమరుగుకానుందా? అంటే అవుననే అంటోంది సోషల్ మీడియా. గత 2016 నవంబరు 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 
 
ఆ తర్వాత వాటి స్థానంలో రూ.500 కొత్త నోటు, రూ.2 వేల నోటును చెలామణీలోకి తెచ్చారు. రూ.1000 నోటు మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం త్వరలోనే రూ.వెయ్యి నోటు అందుబాటులోకి రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
అంతేకాదు.. ఆ కొత్త రూ.1000 నోటు ఎలా ఉంటుందో కూడా.. ఓ ఎడిటింగ్ ఫోటోని చూపిస్తూ.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్త వెయ్యి రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రిస్తోందని.. మార్కెట్లోకి విడుదల కూడా చేసిందని పోస్టులు పెడుతున్నారు.

అయితే అది చూసిన జనమంతా నిజమేనేమో అనుకుంటూ.. బ్యాంకులను కూడా సంప్రదించడం మొదలెట్టారు. అక్కడ ఇక్కడ ఈ వార్త వైరల్‌గా మారి.. చివరకు ఆర్బీఐ వరకు చేరుకుంది.
 
వదంతులు వ్యాప్తిచెందుతున్నాయని.. అలర్ట్ అయిన ఆర్బీఐ ఇదంతా అసత్యవార్తలంటూ వివరణ ఇచ్చింది. తాము కొత్త రూ.1000 నోట్ల విడుదల చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments