Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘బేసిక్ సేవింగ్ బ్యాంకు’ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు : అరుంధతి

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తీసుకునిరానుంది. అంటే బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ రూ.5 వేల మి

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (13:03 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తీసుకునిరానుంది. అంటే బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ రూ.5 వేల మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచాలన్నది ఆ నిబంధన సారాంశం. దీనిపై దేశవ్యాప్తంగా అలజడి చెలరేగింది. ఎస్.బి.ఐ తీసుకునే నిర్ణయం వల్ల సుమారు 31 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక మంది తమ ఖ్యాతాలను మూసివేయనున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
దీంతో ఆ బ్యాంకు ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య స్పందించారు. ‘బేసిక్ సేవింగ్ బ్యాంకు’ ఖాతాలు లేదా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. ‘‘ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు. మిగతా బ్యాంకుల్లో చాలావరకు ఈ చార్జీలను అమలు చేస్తున్నారు’’ అని భట్టాచార్య గుర్తు చేశారు. నూతన నిబంధనలు సరిగ్గా చదవని వారే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు 2012లో అప్పటివరకు అమల్లో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. తిరిగి తాజాగా ఏప్రిల్ 1 నుంచి మళ్లీ అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. అయితే బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న నిబంధనలపై వెనక్కి తగ్గేలా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments