Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యంతర బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లు-ఐదేళ్ల కాలం స్వర్ణయుగం

సెల్వి
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (13:49 IST)
మధ్యంతర బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలు మినహా రాబడికి రూ.30.80 లక్షల కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.11.11 లక్షల కోట్లు.. అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పులు : రూ.11.75 లక్షల కోట్లు, సవరించిన రెవన్యూ వ్యయం కోసం రూ. 44.90 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత దేశ అభివృద్ధికి రాబోయే ఐదేళ్ల కాలం స్వర్ణయుగం కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తమ సర్కారు కృషితో పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. 
 
పేదరిక నిర్మూలనకు రాబోయే రోజుల్లోనూ కృషి చేస్తామని, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడులకు స్వర్ణయుగంగా మారిందని నిర్మల చెప్పారు. విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత మధ్యంతర బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.  వందే భారత్ ట్రైన్లతో రైల్వేలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. మిగతా రైళ్ల బోగీలను కూడా వందేభారత్ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments