Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత టీకి కష్టకాలం: రసాయనాలు ఎక్కువ.. తిప్పి పంపేస్తున్నారు...

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (18:20 IST)
Tea
భారత టీకి కష్టకాలం వచ్చింది. భారత టీని విదేశాలు తిరిగి పంపుతున్నాయి. చాలాదేశాలు అధిక పురుగుమందులు, రసాయనాల కంటెంట్ పరిమితి కంటే ఎక్కువగా వున్న కారణంగా భారతీయ టీ సరఫరాలను తిరిగి పంపుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక సృష్టించిన శూన్యతను నింపి, టీ బోర్డు ఎగుమతులను పెంచడానికి చూస్తోంది. 
 
పురుగుమందులు, రసాయనాలు అనుమతించిన పరిమితి కంటే అధికంగా వుండటంతో అంతర్జాతీయ, దేశీయ కొనుగోలుదారులు టీ కన్సైన్మెంట్లను తిరస్కరించారని ఇండియన్ టీ ఎగుమతిదారుల సంఘం (ఐటిఇఎ) చైర్మన్ అన్షుమన్ కనోరియా తెలిపారు. 
 
దేశంలో విక్రయించే అన్ని టీలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అయితే, చాలా మంది కొనుగోలుదారులు అసాధారణంగా అధిక రసాయన కంటెంట్ ఉన్న టీని కొనుగోలు చేస్తున్నారని కనోరియా తెలిపారు.
 
2021లో భారత్ 195.90 మిలియన్ కిలోల టీని ఎగుమతి చేసింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్) దేశాలు, ఇరాన్ ప్రధాన కొనుగోలుదారులు. ఈ ఏడాది300 మిలియన్ కిలోల టీని సాధించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 
 
చాలా దేశాలు టీ కోసం కఠినమైన ప్రవేశ నిబంధనలను అనుసరిస్తున్నాయని మిస్టర్ కనోరియా చెప్పారు. చాలా దేశాలు ఈయూ ప్రమాణాల యొక్క వైవిధ్యాలను అనుసరిస్తాయి, ఇవి FSSAI నిబంధనల కంటే మరింత కఠినంగా ఉంటాయి. 
 
చట్టాన్ని పాటించే బదులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను మరింత ఉదారంగా మార్చాలని చాలా మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్షుమన్ కనోరియా చెప్పారు. ఈ విషయంపై టీ ప్యాకర్లు, ఎగుమతిదారుల నుండి ఫిర్యాదులు వచ్చాయని టీ బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో భారత టీలో నాణ్యత తగ్గిందని.. అధిక పురుగుమందుల రసాయనాలు కంటెంట్ కంటే ఎక్కువగా వున్నందున తిప్పి పంపుతున్నట్లు కనోరియా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments