వంట గ్యాస్ ధర బాదుడు... సబ్సిడీయేతర గ్యాస్ ధర పెంపు

Webdunia
గురువారం, 1 జులై 2021 (11:50 IST)
దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధ‌ర పెరుగుద‌ల‌తో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధ‌ర‌ల రూపంలో మరో పిడుగు పడుతోంది.
 
తాజాగా సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. కొత్తగా పెంచిన ధరల మేరకు... 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్‌పై రూ.25.50 పెంచుతున్న‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ తెలిపింది. 
 
ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆరు నెల‌ల్లో 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధర రూ.140 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబైలో మే 1 నుంచి 809 రూపాయ‌లుగా ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది.
 
చెన్నైలో అత్య‌ధికంగా రూ.850.50గా 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధ‌ర ఉంది. మే 1 నుంచి నిన్న‌టివ‌ర‌కు అక్క‌డ సిలిండర్ ధ‌ర 825 రూపాయ‌లుగా ఉంది. కాగా, 19 కిలోల‌ వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.76 పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments