Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరించిన చమురు కంపెనీలు..

వరుణ్
గురువారం, 1 ఆగస్టు 2024 (11:43 IST)
వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. ఈ సవరణలో భాగంగా వాణిజ్య సిలిండర్ ధరపై రూ.8.50 పైసలు చొప్పున స్వల్పంగా భారం మోపాయి. కొత్త నెల ఆగస్టు ప్రారంభంకావడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 మేరకు పెంచాయి. సవరించిన ధర నేటి నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
ఈ సవరించిన ధరల ప్రకారం... ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.6.50 మేరకు పెరిగి రూ.1646 నుంచి రూ.1652.50కు చేరింది. కోల్‌కతాలో రూ.8.50 మేర పెరిగి రూ.1764.50కి చేరగా, ముంబైలో 1605, చెన్నైలో రూ.1817గా ధరలు ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 
 
అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ ధరలను యథాతథంగానే చమురు కంపెనీలు ఉంచాయి. ప్రస్తుతం ఈ ధరలు ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో 829, ముంబైలో రూ.803, చెన్నైలో 818.50గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments