Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నగరాల్లో రూ.750కే వంట గ్యాస్ సిలిండర్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:29 IST)
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ సిలిండర్ ధరలు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పెద్ద గుదిబండలా తయారయ్యాయి. ఈ ధరలు ప్రతి ఒక్క కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర ప్రస్తుతం దాదాపు రూ.1100 వరకు పలుకుతోంది. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఆయిల్ కంపెనీ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద 28 నగరాల్లో రూ.750కే వంట గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేయనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో లభించే సాధారణ సిలిండర్ ధర కంటే రూ.300 తక్కువగా ఉంది. 
 
ఈ పథకం అమలు కోసం ఇండేన్ కాంపోజిట్ సిలిండర్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది సాధారణ సిలిండర్‌తో పోల్చితే బరువు తక్కువగా ఉంటుంది. అంటే కేవలం 10 కేజీల గ్యాస్ అందుబాటులో ఉంటుంది. అందుకే దీని ధర కూడా తక్కువగా ఉంటుంది. పైగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లవచ్చు.
 
ఈ సదుపాయాన్ని తొలుతు 28 నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సిలిండర్లను అందించనుంది. మరోవైపు, దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం సంబంధిత ఆయిల్ కంపెనీలకు భారీ మొత్తంలో రాయితీ ఇవ్వాలని భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments