Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా మోటార్స్ కీలక ప్రకటన : మరో రూ.400 కోట్ల పెట్టుబడి

Webdunia
గురువారం, 28 మే 2020 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కియా మోటార్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలు హల్చల్ చేశాయి. పైగా తన ప్లాంట్ విస్తరణను ఏపీలో నిలిపివేసి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సంస్థ విస్తరణ పనులు చేపట్టనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలు అలా ఉండిపోయాయి.
 
ఇపుడు కియా మోటార్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ఈ కార్ల ఉత్పత్తి సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు.
 
'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments