భారత్‌లో పలు అభివృద్ధి పనులకు జపాన్ ఆర్థికసాయం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (11:48 IST)
భారత్‌లో పలు అభివృద్ధి పనులకు జపాన్ ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.200 కోట్లకు పైగా (2.11 బిలియన్ డాలర్లు) ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులతో ఢిల్లీ మెట్రో నాలుగో దశకు ఉద్దేశించిన సాయం కూడా ఉంది. 
 
బెంగుళూరు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు 52.03 బిలియన్ యెన్‌లు, ఢిల్లీ మెట్రో నాలుగో దశకు 119.97 బిలియన్ యెన్‌లు విడుదల కానున్నాయి. ఢిల్లీ మెట్రోకు మొదటి నుంచీ జపాన్ సాయం చేస్తూ వస్తోంది. 1997 నుంచి ఓడీయే రుణం కింద సుమారు 47 వేలకోట్ల సాయం లభించింది. 
 
హిమాచల్ ప్రదేశ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోషన్ రెండో దశ  ప్రాజెక్టుకు 11.30 బిలియన్ యెన్‌ల ఆర్థిక సాయం లభించబోతోంది. రాజస్థాన్ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ రెండో దశకు, ఫ్లోరోసిస్ మిటిగేషన్ (నివారణ)కు కూడా జపాన్ నుంచి 45.816 బిలియన్ యెన్‌లు అందనున్నాయి. 
 
ముఖ్యంగా రాజస్థాన్‌లోని రెండు జిల్లాలలో (జునిజ్ను, బార్మర్) గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఈ సాయం ఉద్దేశించినది. అండమాన్ నికోబార్ దీవుల్లో పవర్ సప్లయ్ ప్రాజెక్టులకు 4.01 బిలియన్ యెన్‌ల రుణం లభిస్తుందని జపాన్ ఎంబసీ తెలిపింది. 
 
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి సీ.ఎస్. మహాపాత్ర, జపాన్ రాయబారి సతోషి సుజుకీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన ఈ రుణసాయం తాలూకు ఒడంబడిక కుదిరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments