Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్ను దాఖలు గడువును పెంచిన ఐటీ శాఖ

Webdunia
శనివారం, 4 జులై 2020 (17:48 IST)
ఆదాయ పన్ను దాఖలు చేసే వారికి ఆదాయపన్ను శాఖ మరో వెసులుబాటు కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖల చేసేందుకు గడువును మరింతగా పొడగించింది. ఈ తాజా పొడగింపు మేరకు ఐటీ రిటర్నును వచ్చే నవంబరు 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని పేర్కొంది. 
 
కరోనా సంక్షోభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రివైజ్డ్ ఐటీ రిటర్నులను ఫైల్ చేసే సమయాన్ని ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 
 
పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన విషయం తెల్సిందే. వాస్తానికి ఇది గత నెలాఖరుతో ముగిసింది. కానీ, కరోనా వైరస్ కారణంగా దీన్ని పొడగించింది. 
 
అలాగే, పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువును అక్టోబరు 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీని ఆగస్టు 15 వరకు పొడిగించినట్టు ఐటీ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments