అంతా కరోనా పుణ్యం.. డబుల్ డెక్కర్ విమానాలు కూడా వచ్చేస్తున్నాయ్..!

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (14:33 IST)
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్ల తరహాలో ప్రస్తుతం డబుల్ డెక్కర్ విమానాలు వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయం వస్తుంది కనుక కంపెనీలకు ఇదేమీ భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవారికి లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉన్నాయి. ఇకపై ఇవి వుండవు. విమానం మొత్తంగా డబుల్ డెక్కర్ సీట్లు మాత్రమే ఉంటాయి. అయితే విమానాల్లో డబుల్ డెక్కర్ పరిణామానికి దారి తీసేందుకు కారణం కరోనానే. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాల్లో ఈ కొత్త సీటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య దూరం ఉండేలా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డిజైనర్ జాఫ్రీ ఓనీల్‌తో విమానయాన సంస్థలు 2-4-2 కాన్ఫిగరేషన్ సీటింగ్ అందించనున్నాయి.
1970 నుంచి చాలావరకు విమానయాన సీట్లలో మార్పులేదు.
 
ఎకానమీ క్లాస్ సీట్లలో 99 శాతం నిటారుగా నిద్రించడానికి అసాధ్యం. డబుల్ డెక్కర్ సదుపాయం వస్తే విమానాల్లో ప్రయాణించే వారిలో 70 శాతం మంది లై ఫ్లాట్ భంగిమలో నిద్రించవచ్చు. ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందిస్తూ.. ప్రజలకు డబ్బు ఆదా చేస్తుంది. అంతేకాదు ఎకానమీ క్లాస్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సాయపడుతుంది. 
 
సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో నిద్రంచటానికి వీలుగా ఉండేలా సీటింగ్ డిజైన్ ఉంటుంది. ఏ సీటు కూడా సాంద్రత కోల్పోకుండా ఉండేలా విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments