Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nimbooz నిమ్మరసమా..? పండ్ల రసమా? సుప్రీంకు పంచాయతీ

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (15:25 IST)
Nimbooz
పెప్సికో సంస్థ వేసవికి 'నింబూజ్' పేరుతో నిమ్మడ్రింకును మార్కెట్లో దించుతుంది. ఇప్పుడు ఈ డ్రింకు పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఈ పానీయం గురించి సుప్రీంకోర్టులో పంచాయతీ జరుగబోతోంది. కొంత మంది దీన్ని నిమ్మరసం అంటుంటే, మరికొందరు దీన్ని పండ్ల రసంగా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమాధానాన్ని ఇప్పుడు సుప్రీం కోర్టు తేల్చనుంది.
 
ఆరాధనా ఫుడ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పానీయాన్ని 'పండ్లు గుజ్జు లేదా పండ్ల రసం' గా వర్గీకరించారు. అయితే దీన్ని తయారుచేసిన పెప్సికో సంస్థ మాత్రం కేవలం 'నిమ్మరసం'గా మాత్రమే పిలవాలని కోరుకుంటోంది. 
 
తాజా నివేదికల ప్రకారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్‌లో విచారించనుంది. అది ఏ కేటగిరీ డ్రింకో నిర్ణయించుకున్న తరువాత దానికి విధించాల్సిన ఎక్సైజ్ సుంకాన్ని కూడా నిర్ణయించనున్నారు.
 
2013లో తొలిసారి నింబూజ్‌ను పెప్సికో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి ఫిజ్ లేకుండా నిజమైన నిమ్మరసంతో తయారుచేసినట్టు వారు వివరించారు. ఆ తరువాత అది నిమ్మరసమా లేక పండరసమా అనే చర్చ మొదలైంది. 2015 మార్చిలో పిటిషనర్లు నింబూజ్ పై కేసును వేశారు. అప్పట్నించి కేసు నడూస్తూనే ఉంది. ఈ ఏప్రిల్ లో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments