Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్స్ జీఎస్టీ చెల్లించాలా? వద్దా?

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (10:05 IST)
గతంలో ఒక అపార్ట్‌మెంట్ అంటే మహా ఆయితే, నాలుగైదు అంతస్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. వీటిలో కనీస అవసరాలు మాత్రమే ఉండేవి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల అభిరుచుల్లో మార్పులతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో వివిధ సదుపాయాలు ఉండే బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో సకల సౌకర్యాలు ఉంటాయి., దీంతో అనేక మంది ఈ తరహా అపార్టుమెంట్ జీవనశైలికే మొగ్గు చూపుతున్నారు. 
 
బిల్డర్‌ తాను అపార్ట్‌మెంట్‌ కట్టే సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించినా ఆ తర్వాత వాటిని మెయింటెయిన్‌ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అపార్ట్‌మెంట్‌లో నివసించే వారు ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లేదా సొసైటీగా వ్యవహరిస్తారు.
 
ఈ అసోసియేషన్‌ పని ఏమిటంటే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని పనులు అంటే.. సెక్యూరిటీ, లిఫ్ట్‌, కామన్‌ ఏరియా, పార్క్‌లు, ఆట స్థలాలు మొదలైన వాటిని చూసుకుంటుంది. దీనిలో అపార్ట్‌మెంట్‌లోని అందరూ.. సభ్యులుగా వ్యవహరిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం ప్రతి సభ్యుడి నుంచి కొంత మొత్తం మెయింటెనెన్స్‌ చార్జీల కింద వసూలు చేస్తారు. మరి ఇలా వసూలు చేసే మెయింటెనెన్స్‌ చార్జీల మీద ఆయా సంక్షేమ సంఘాలు జీఎస్‌టీ చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే దాని విధివిధానాలు ఏమిటి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
 
ముందుగా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ జీఎస్‌టీ చెల్లించాలా అంటే.. ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తమ సభ్యుల ద్వారా వసూలు చేసే మొత్తం.. సంవత్సరానికి రూ.20 లక్షలు దాటనంత వరకు ఆయా సంక్షేమ సంఘాలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. ఒకవేళ ఆ మొత్తం రూ.20 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్‌ తప్పకుండా తీసుకోవాలి. ఇంకా సభ్యుడి నుంచి వసూలు చేసే నెలవారీ మెయింటెనెన్స్‌ చార్జీ నెలకు రూ.7,500 మించకపోతే ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments