Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాబ్ది కంటే వేగంగా నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (19:11 IST)
భారతీయ రైల్వే జాబితాలో మరో రైలు చేరనుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు పేరుంది. దీనికంటే వేగంగా మరో రైలును ప్రవేశపెట్టనుంది. దీనికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేశారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఈ తరహా రైలును తొలుత ఢిల్లీ - వారణాసిల మధ్య ప్రవేశపెట్టనున్నారు. 
 
మూడు దశాబ్దాల క్రితం ఇండియన్ రైల్వేలో ప్రవేశించిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సక్సెసర్‌గా దీనిని తీసుకొస్తున్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 
 
మొత్తం రూ.97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలీలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం 18 నెలల్లోనే దీనిని తయారు చేశారు. దేశంలోని తొలి ఇంజిన్ లెస్ (లోకోమెటివ్ లేని) రైలుగా ఇది గుర్తింపు పొందనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలుకు పేరు పెట్టాల్సిందిగా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు కోరింది. వేలాదిమంది పలు పేర్లు సూచించినప్పటికీ చివరికి 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'గా పేరు పెట్టినట్టు మంత్రి గోయల్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments