Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:18 IST)
భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట లభించనుంది. 
 
దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. దీంతో ఇకపై ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. 
 
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతుండగా మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీంతో నగదు చెల్లింపులు తగ్గించి, డిజిటల్ లావాదేవీలను పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం