Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూచ్... 60 పైసలు కాదు.. ఒక్క పైసా మాత్రమే తగ్గించాం...

దేశవ్యాప్తంగా పెట్రోల్ - డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.

Webdunia
బుధవారం, 30 మే 2018 (12:14 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ - డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.
 
ఈ నేపథ్యంలో వరుసగా 19 రోజుల పాటు పరుగాపకుండా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, బుధవారం 60 పైసలు తగ్గాయని వాహనదారులు పడ్డారు. కానీ ఆనందం మూడు గంటల ముచ్చటే అయింది. పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
 
బుధవారం పెట్రోలు ధరను 60 పైసలు, డీజెల్ ధరను 59 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన తప్పును గుర్తించి.. తగ్గించిన ధరకు సవరణ చేసింది. దీంతో లీటరు పెట్రోల్‌పై కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments