Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ నిర్భర్ భారత్ : ఏసీల దిగుమతిపై కేంద్రం నిషేధం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఆత్మ నిర్భర్ భారత్ అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ప్రస్తుతం దేశంలో సగటున 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. వీటిని సాధ్యమైనత మేరకు తక్కువ సమయంలోనే దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పైగా, అత్యవసరమైనవి మినహా ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యలక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ను ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఏసీలపై ఇదే తరహా నిషేధం విధించారు. దీంతో స్వదేశీ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments