Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే..?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (19:03 IST)
పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30 చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్ నంబర్‌ను 30.06.2023న లేదా అంతకు ముందు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 
 
నిర్దిష్ట తేదీలోగా తమ ఆధార్- పాన్‌లను లింక్ చేయకుంటే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కోవాల్సిన శిక్షా చర్యలను కూడా దానితోపాటు ఉన్న నోటిఫికేషన్‌లో ఆదాయ పన్ను శాఖ వివరించింది. 
 
జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ డీయాక్టివేట్ చేయబడుతుంది. అందువల్ల పన్ను మినహాయింపు (TDS), పన్ను వసూలు (TCS) రెండూ తీసివేయబడతాయి.
 
పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు, వాపసులపై వడ్డీ కూడా మంజూరు చేయబడదు. దీంతో పాటు పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేస్తే జరిమానాను పెంచనున్నట్లు తెలిసింది. 
 
ఆధార్‌తో లింక్ చేయకుండా పాన్‌ను ఉపయోగించినందుకు రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి, ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments