Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే లీటరు పెట్రోల్ రూ.32కే లభిస్తుందట.. ఏంటో ఆ చిదంబర రహస్యం!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:19 IST)
దేశంలో చమురు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న ఈ పెట్రోల్, డీజల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరల పెరుగదల కారణంగా నిత్యావసర వస్తు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ విత్తమంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై విధిస్తున్న సెస్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. 
 
సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని ఆరోపించారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్‌లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్‌లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ.32కే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
అలాగే, దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ  ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే, అమలులో కొంత వైఫల్యం చెందారని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును చేపట్టారని... అయితే నల్లధనం ఉన్నవారు వారి డబ్బును వివిధ రకాలుగా వైట్‌గా మార్చుకున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments