Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (08:46 IST)
దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు రోజురోజుకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజల్ ధరలు రోజువారీగా పెంచేస్తున్నారు. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ధరను రూ.273.50కు పెంచేశారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో ఈ సిలిండర్ ధర రూ.2,186 నుంచి రూ.2,460కు చేరింది. 
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ ధర రూ.2,253కి ఎగబాకింది. గత రెండు నెలల్లో ఈ సిలిండర్ ధరపై ఏకంగా రూ.346 పెరగడం గమనార్హం. కాగా, మార్చి ఒకటో తేదీన రూ.105 పెంచిన చమురు కంపెనీలు 22న రూ.9 పెంచాయి. ఈ సారి ఏకంగా రూ.273.50 చొప్పున పెంచాయి. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం చమురు కంపెనీలు ఊరట నిచ్చాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments