Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర నుంచి తెలంగాణాకు హై స్పీడ్ రైలు - మార్గంపై కసరత్తు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (12:41 IST)
దేశంలో హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా, మహారాష్ట్రలోని ఠాణె నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వరకు హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించే అంశంపై కసరత్తును ప్రారంభించింది.
 
ఇదే అంశంపై నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొల్లూరు స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరేలా ప్రణాళిక వేస్తున్నట్లు వారు వివరించారు. ఈ స్టేషన్‌ పేరును హైదరాబాద్‌గా వ్యవహరించే అవకాశముందని తెలిపారు.
 
ఈ మార్గంలో హైదరాబాద్‌ (కొల్లూరు), వికారాబాద్‌, గుల్బర్గా, షోలాపుర్‌, పండరీపుర్‌, బారామతి, పుణె, లోనావాలా, నవీ ముంబై, ఠాణె మొత్తం పది స్టేషన్లుంటాయి. పది బోగీలు.. 750 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నడుస్తుందని, ప్రాజెక్టు పూర్తికి 1,197.5 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశామని వారు తెలిపారు.
 
ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ పూర్తి కావొచ్చని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments