Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర నుంచి తెలంగాణాకు హై స్పీడ్ రైలు - మార్గంపై కసరత్తు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (12:41 IST)
దేశంలో హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా, మహారాష్ట్రలోని ఠాణె నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వరకు హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించే అంశంపై కసరత్తును ప్రారంభించింది.
 
ఇదే అంశంపై నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొల్లూరు స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరేలా ప్రణాళిక వేస్తున్నట్లు వారు వివరించారు. ఈ స్టేషన్‌ పేరును హైదరాబాద్‌గా వ్యవహరించే అవకాశముందని తెలిపారు.
 
ఈ మార్గంలో హైదరాబాద్‌ (కొల్లూరు), వికారాబాద్‌, గుల్బర్గా, షోలాపుర్‌, పండరీపుర్‌, బారామతి, పుణె, లోనావాలా, నవీ ముంబై, ఠాణె మొత్తం పది స్టేషన్లుంటాయి. పది బోగీలు.. 750 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నడుస్తుందని, ప్రాజెక్టు పూర్తికి 1,197.5 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశామని వారు తెలిపారు.
 
ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ పూర్తి కావొచ్చని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments