Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మిగిలే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవే...

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (07:34 IST)
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసింది. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఫలితంగా ప్రస్తుతం దేశంలో 12కు పైగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం సగానికి తగ్గిపోనున్నాయి. అంటే కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే మిగలనున్నాయి. మిగతా ఆరింటిని కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రైవేటీకరించనున్నట్లు తెలిసింది. కొత్త పెట్టుబడుల ఉపసంహరణ విధాలంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు బ్యాంకింగ్‌ సేవలను వ్యూహాత్మక రంగాల జాబితాలో చేర్చింది. 
 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు గత విలీన ప్రక్రియల్లో భాగమైన బ్యాంకులను మినహాయించి, మిగతా వాటన్నింటినీ ప్రైవేటీకరించాల్సిన పీఎస్‌బీల జాబితాలో చేర్చినట్లు సమాచారం. అందులో రెండు పీఎస్‌బీలను వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రైవేటీకరించనున్నారు. 
 
దీంతో భవిష్యత్‌లో దేశంలో మిగిలనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలిస్తే, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులు మాత్రమే ఉంటాయి. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments