Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు డౌన్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (12:33 IST)
బంగారం కొంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర తగ్గడంతో... వెండి ధర కూడా బాగా పడిపోయింది.  హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,330కు క్షీణించింది. 
 
అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.50,940కు క్షీణించింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధర తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,450 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,600కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1785 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం తగ్గుదలతో 18.23 డాలర్లకు క్షీణించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments