బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు డౌన్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (12:33 IST)
బంగారం కొంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర తగ్గడంతో... వెండి ధర కూడా బాగా పడిపోయింది.  హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,330కు క్షీణించింది. 
 
అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.50,940కు క్షీణించింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధర తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,450 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,600కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1785 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం తగ్గుదలతో 18.23 డాలర్లకు క్షీణించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments