Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ న్యూస్: పడిపోయిన పసిడి ధరలు.. వెండి కూడా తగ్గుముఖం..

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (14:41 IST)
పసిడి ధరలు పడిపోయాయి. బంగారం ధర వరుసగా రెండో రోజు దిగి వచ్చింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,110కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 క్షీణతతో రూ.41,350కు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.800 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,500కు దిగొచ్చింది. 
 
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మరింత తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 1684 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.37 శాతం క్షీణతతో 24.04 డాలర్లకు తగ్గింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments