Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత మహిళ

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (13:46 IST)
అమెరికాలో నివశిస్తున్న భారత మహిళకు మరో అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో తొలి మహిళా చీఫ్ ఎకనమిస్ట్‌‌గా నియమితులయ్యారు. ఆమె పేరు గీతా గోపీనాథ్. తమిళనాడు వాసి. ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈమె ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరుగా గుర్తింపు పొందారు. ఈమెను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా నియమించుకుంటామని గత యేడాది అక్టోబరు ఒకటో తేదీన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే ప్రకటించారు. ఆ ప్రకారంగా గీతా గోపీనాథ్‌ను చీఫ్ ఎకనమిస్టుగా నియమించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇలాంటి ఉన్నత పదవి దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాల పెంపు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments